అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి విద్యుత్ కొనుగోలుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ద్వారా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టమైంది.
టీడీపీ ఆరోపణలపై వాస్తవాలు
తెలుగుదేశం పార్టీ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ. లక్ష కోట్ల భారం పడిందని తన అనుబంధ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఇప్పుడు APERC ఈ ఒప్పందాలను అనుమతించడంతో ఈ ఆరోపణలు తప్పుడు ప్రాతిపదికపై ఉన్నట్లు తేలిపోయింది.
రాష్ట్రానికి లాభదాయకమైన ఒప్పందాలు
SECI ఒప్పందాల ద్వారా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.1.1 లక్ష కోట్ల మేర ఆదా అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్ అందించే అవకాశం కూడా ఉంది.
తప్పుడు ప్రచారం ప్రజల ముందే బహిర్గతం
రాష్ట్రానికి లాభదాయకమైన విద్యుత్ ఒప్పందాలను రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుబట్టడం తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చింది. విద్యుత్ రంగానికి ఉపయోగపడే ఈ ఒప్పందాలను దుష్ప్రచారానికి వాడుకోవడం ప్రజాస్వామిక ధర్మాలకు విరుద్ధమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. APERC అనుమతి అనంతరం వాస్తవాలు బయటకు వచ్చాయి. SECI ఒప్పందాలు తక్కువ ధరలో విద్యుత్ అందించడంలో YS జగన్ ప్రభుత్వం కీలక పాత్ర వహించింది.
టీడీపీ తప్పుడు ప్రచారం బహిర్గతం: విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు వెల్లడి
