ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా అస్తవ్యస్తత: 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనా సమస్యలతో కుదేలైపోయింది. అంతర్గత గొడవలు, సమర్థతా లోపం వల్ల 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది.

ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న శాఖలు:

పంచాయతీరాజ్ శాఖ – 14,140 ఫైళ్లు
సాధారణ పరిపాలన (డిప్యూటీ సీఎం & సీఎం పరిధి) – 11,958 ఫైళ్లు

ఇక ప్రతిపక్షాల మాట ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు & జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిపాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రాజకీయ హంగామాలకే ఫోకస్ చేస్తున్నారు. ప్రజల సమస్యల్ని తీర్చాల్సిన ప్రభుత్వం, అదే ప్రజల టాక్స్ డబ్బుతో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిపక్షాలను ఎగతాళి చేసే పనిలో పడిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

2024 ఎన్నికల హామీలు – ఇప్పుడు పరిస్థితి:

ఎన్నికల ముందు హామీలు ఇవే:
1.  5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
2. అర్హులైన మహిళలకు నెలకు ₹1,500 పెన్షన్
3. నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 ఆర్థిక సహాయం
4. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

కానీ ఇప్పుడు ప్రభుత్వ పనితీరు పూర్తిగా ఆగిపోయింది. పెండింగ్ ఫైళ్ల సంఖ్య చూస్తే ఈ హామీలన్నీ అమలు అవుతాయా? లేదా మళ్లీ ఎన్నికల వరకు మాటలేనా? అన్న అనుమానం ప్రజల్లో బలంగా నెలకొంటోంది. పాలనలో సరైన దిశ లేకపోవడం, ప్రభుత్వ నిధుల వృథా, రాజకీయ కక్షలతో ప్రజల నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతూ, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *