వైసీపీ సమన్వయకర్తల సమావేశం: ఫీజు పోరు కోసం సిద్ధం

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించారు. ఫిబ్రవరి 5న జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ సమావేశంలో విడుదల చేశారు.

ఫీజు పోరు పై వైసీపీ నేతల ప్రతిజ్ఞ

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, “తల్లికి వందనం పేరుతో చంద్రబాబు మరో మోసం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు” అని విమర్శించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న బిసెంట్ రోడ్ వైసీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి మెమోరాండం సమర్పిస్తామని ప్రకటించారు.

నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ, “చంద్రబాబు మాట ఇచ్చి తప్పారు. డబ్బుల్లేవు, పథకాలు అమలు చేయడం కుదరదని చెప్పడం దుర్మార్గం” అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ హయాంలోనూ, జగన్ పాలనలోనూ విద్యార్థులకు అండగా నిలిచామన్నారు.

“ఫీజు బకాయిల చెల్లింపు వరకు పోరాటం” – మల్లాది విష్ణు

సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లాది విష్ణు మాట్లాడుతూ, “టిడిపి ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తోంది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు చెల్లించేలా పోరాడతాం” అన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని జగన్ తండ్రి వైఎస్ఆర్ నుంచి ఆయన వరకు నిరూపించారని అన్నారు.

“కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది” – నెల్లగుంట్ల స్వామిదాసు

తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నెల్లగుంట్ల స్వామిదాసు మాట్లాడుతూ, “జగన్ నాడు-నేడు లాంటి కార్యక్రమాలు అమలు చేసి విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ, కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది” అని ధ్వజమెత్తారు.

ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వైసీపీ పిలుపు

ఈ సమావేశంలో మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రుహుల్ల, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర వైసీపీ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, నర్నల తిరుపతి యాదవ్, పోతినా మహేష్, బెల్లం దుర్గ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *